రెండు రాష్ర్ట‌ల‌కి గ‌వ‌ర్న‌ర్ నరసింహనే

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ను మారుస్తారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. గవర్నర్ మార్పు కోసం ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని తేల్చిచెప్పారామె. గవర్నర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, మంత్రివర్గం నిర్ణయాలు మాత్రమే అమలుపరుస్తారని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.