రెవెన్యూ, ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాం: చిదంబరం

ఢల్లీి : గత 9నెలలుగా తీసుకున్న చర్యలు వల్ల ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధిరేటు  పెంచడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వన్డే మ్యాచ్‌ లాంటిది కాదని వ్యాఖ్యానించారు. రూపాయి పతనంపై అందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈనెలలో మరిన్ని సంస్కరణలు అమలు చేయనున్నట్లు వెల్లడిరచారు. రెవెన్యూ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధిస్తామని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలని అన్ని శాఖలను కోరినట్లు వెల్లడిరచారు.