రేపు మరోసారి భేటీ కానున్న అద్వానీ, రాజ్నాథ్
ఢిల్లీ : అలిగిన అగ్రనేతతో భాజపా సీనియర్ నేతల మంతనాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రి 7 గంటలకు అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ నివాసంలో సమావేశం కానుంది. పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానకి హాజరవుతారు. అద్వానీ రాజీనామా తిరస్కరిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజ్నాథ్సింగ్ రేపు మరోసారి అద్వానీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.