రేపు… వీరశైవ సమాజం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
వీరశైవ సమాజం సభ్యులు.
తాండూరు సెప్టెంబర్ 30 (జనం సాక్షి)రేపు… తాండూర్ వీరశైవ సమాజం మరియు వీరశైవ యువ దళ్, అక్కన్న బళగ, వీరశైవ మహిళ మండలి వారి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాజం సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణం లోని వీరశైవ సమాజం కాంప్లెక్స్ మరియు బసవేశ్వర విగ్రహం నుండి స్వచ్ఛభారత్ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు .ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సమాజ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.