రేపు సాయంత్రం కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

ఢిల్లీ : రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ వర్గాల సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అజయ్‌ మాకెస్‌, జోషీల రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇప్పటికే అమోదించారు. పార్టీ సేవల కోసం మరికొందరు మంత్రులను కేబినెట్‌ నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.