రేషన్‌ డీలర్ల ఆందోళన

మహబూబాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేషన్‌ డీలర్ల, హమాలీ కార్మికుల వేతనాలు పెంచాలని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అందరికీ అడగకుండానే వరాలిస్తున్న కేసీఆర్‌ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తమకు మాత్రం ఎటువంటి హావిూలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు. తమకు న్యాయం చేయాలని లేదంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మార్నేని దామోదర్‌,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్‌ రెడ్డి,కుంభం యాదగిరి, బిర్రు వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.