రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

జనగామ,జూన్‌28(జ‌నం సాక్షి): రానున్న ఏడాదిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అన్ని తండాలకు బీటీ రోడ్డు నిర్మిస్తామనిఅన్నారు. ఇదిలావుంటే తాము తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డీలర్లు కోరుతున్నారు. సరుకుల తగ్గడం, కమిషన్‌ తగ్గడం వల్ల ఉపాధి తగ్గిందన్నారు. తమకు ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావును కోరారు. తమను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇప్పించాలన్నారు. ఈ మేరకు పలువురు రేషన డీలర్లు ఎమ్మెల్యే దయాకర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను విన్నవించారు.