రైతులంతా బీమాకు అర్హులే

జనగామ,జూన్‌14(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం కింద పట్టాదార్‌ పాసుపుస్తకం తీసుకున్న రైతులందరూ జీవిత బీమా పథకానికి అర్హులని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి అన్నారు. రైతుబీమా పథకంలో జిల్లాలోని మండల రైతు సమన్వయ సమితులు భాగస్వాములు కావాలని అన్నారు. రైతు వయస్సు నిర్ధారణ, నామినీ పేర్లను గడువులోగా సేకరించాలని కోరారు. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతుబీమా పథకం కోసం పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న ప్రతీ రైతు నుంచి అధికారులు, గ్రామ, మండల రైతు సమన్వయ సమితులు నామినీ పేర్లతో పాటు పూర్తి వివరాలతో పత్రాలు సేకరించాలని కోరారు. అందరి వివరాలు సేకరించడంలో రైతు సమన్వయ సమితులు,వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.