రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం

` సాగునీటి రాకతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిసాగు
` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):రైతుల శ్రేయస్సే ధేóే్యయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, సాగునీటి రాకతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిసాగవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా కరెంటు అందజేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘‘ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా వానాకాలంలో ఇప్పటి వరకు 57.51 లక్షల ఎకరాలలో వరి,  44.73 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు.వరితో పాటు ఇప్పటి వరకు 5.28 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 4.61 లక్షల ఎకరాలలో కందులు సాగు చేశారు.మొత్తం రాష్ట్రంలో 1.18 కోట్ల ఎకరాలలో వివిధ రకాల వ్యవసాయ  పంటలు సాగు చేస్తున్నారు.భూగర్భ జలవనరులు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు మూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విూద భరోసాతో రైతులు పంటలు సాగుచేస్తున్నారు.సెప్టెంబరు 1న 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదయింది.గత ఏడాది ఇదే రోజు 11,198 మెగావాట్ల విద్యుత్‌ నమోదవడం గమనార్హం .. అయినా రైతాంగానికి కరంటు విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సహకరిస్తోంది.వరుణుడు కరుణించడంతో రాష్ట్రంలో 2న 8891 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌, 3న 7414 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది ఈ ఏడాది కృష్ణా బేసిన్‌ లో వర్షాలు లేకున్నా డిమాండ్‌కు సరిపడా కరంటు సరఫరా చేశారు.రాష్ట్రంలో మొత్తం కరంటు  వినియోగంలో వ్యవసాయ రంగం 35 నుండి 40 శాతం వాటా నమోదవుతున్నది.దేశంలో అత్యధిక శాతం వ్యవసాయ రంగానికి  కరంటు వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే’’ అని అన్నారు.లను కలిగిస్తుందో తెలుసుకోవాల్సి ఉందని సీడీసీ పేర్కొంది.