రైతు ఆత్మహత్యా యత్నం
కడప,ఫిబ్రవరి11(జనంసాక్షి): తన భూమిని ఆన్లైన్ చేయడంలేదంటూ.. గోపవరం రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం కడప జిల్లా గోపవరం మండలంలో చోటు చేసుకుంది. గోపవరం మండలం కాలువ పల్లె గ్రామానికి చెందిన గానుగపెంట శ్రీరాములు అనే రైతు తన భూమిని ఆన్లైన్ చేయాలంటూ గత 5 ఏళ్లుగా… రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు విన్నవించుకున్నా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతో.. మనస్తాపం చెందిన రైతు ఈ రోజు ఉదయం గోపవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.