రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేసాని లింగా రెడ్డి

 కొండమల్లేపల్లి ఫిబ్రవరి 20 (జనంసాక్షి) న్యూస్ : నల్లగొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఎన్నికై నేడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కొండమల్లేపల్లి మండల రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి ఈ సందర్భంగా కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని వ్యవసాయ ఉత్పాదకతను మరియు రైతులకు ఆదాయాన్ని పెంచడానికి పెట్టుబడి అనేది ఖచ్చితంగా మార్గం, గ్రామీణ రుణాల యొక్క దుర్మార్గపు చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది రైతులు మళ్లీ రుణ ఉచ్చులో పడకుండా చూసుకోవటానికి, “వ్యవసాయ పెట్టుబడి సహాయ పథకం” (“రైతు బంధు”) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి రైతులు గౌరవప్రదంగా ఉండే విధంగా చేసిందని తెలిపారు రైతుబంధు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చాలా ఉపయోగపడిందని తెలిపారు అనంతరం జిల్లా రైతుబంధు అధ్యక్షులుగా ఎన్నికైన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయిని జైపాల్ రెడ్డి తో పాటు రైతు సోదరులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు