రోడ్డుప్రమాదంలో దంపతులకు గాయాలు

ఏలూరు,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని భట్లమాగుటూరులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోడూరు మండల మిలిమంచిలిపాడు చెందిన తమ్మినీడి సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులు చేబ్రోలు నుండి పోడూరుకు తిరిగి వస్తుండగా.. భట్లమాగుటూరు వచ్చేసరికి, ఎదురుగా సైకిల్‌ పై వస్తున్న పిల్లాడిని తప్పించబోయి.. అదుపుతప్పి పక్కన ఉన్న పంట పొలాల్లో పడిపోయారు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలవ్వగా, గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ భట్లమాగుటూరు పిహెచ్‌సి కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.