రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

గజపతినగరం(విజయనగరం): 43వ జాతీయ రహదారిపై గజపతినగరం మండలం బండపల్లి గ్రామంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి బొబ్బిలి నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరానికి వస్త్ర వ్యాపారి మీసాల శంకర్‌రావు (25), చింతల నాగరాజు (24)లు మృతి చెందారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బుగత సన్యాసిరావును విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బండపల్లి ఎస్సై డీడీ నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.