రోడ్ మ్యాప్ పరిశీలించాక అధిష్ఠానానికి నివేదిస్తా దిగ్విజయ్
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనను రోడ్మ్యాప్ తయారు చేయమని చెప్పినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్ తెలిపారు. ఢిల్లీలో అయన మీడియాతో మాట్లాడుతూ…. రోడ్ మ్యాప్ను పరిశీలించిన తర్వాత అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెప్పారు. దిగ్విజయ్సింగ్ అంతకు ముందు కేంద్ర హోం మంత్రి షిండేతో సమావేశమయ్యారు. షిండేతో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించేందుకు దిగ్విజయ్సింగ్ నిరాకరించారు.