లగడపాటి మళ్లీ లత్కోరు మాటలు

హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) :
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరోసారి లత్కోరు వాగుడు వాగాడు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినా ప్రత్యేక రాష్ట్రం రాదంటూ పిచ్చిప్రేళాపనలకు దిగాడు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలున్నాయని ప్రకటిస్తుండగా లగడపాటి మాత్రం ఎప్పటిలాగే జోకర్‌లాగా మాట్లాడారు. రాష్ట్రం సమైక్యాంగానే ఉంటుందంటూ జోస్యం చెప్పబోయారు. ఆయన ప్రకటనలు చూసి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులే నవ్వుకున్నారు.