లాభాల బాటలోకి స్టాక్ మార్కెట్లు
ముంబయి,(జనంసాక్షి): మూడు రోజులుగా నష్టపోతున్న స్టాక్మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. గురువారం సెన్సెక్స్ 233 పాయింట్లు ఎగసింది. ఐటీ రంగంలో కొనుగోళ్లు జరగడం మార్కెట్లు పెరుగుదలకు వూతమిచ్చింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 66.05 పాయింట్లు పెరిగింది. రూపాయి బలహీనపడటం, యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలపడటం వంటి అంశాలు ఐటీషేర్లను ప్రభావితం చేశాయి.