లోయలో పడిన బస్సు

18 మంది మృతి

షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఒక బస్సు లోయలో పడి 18 మంది మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. సిర్మౌర్‌ జిల్లాలో సంగ్రా ప్రాంతంలో 35 మంది ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు 500 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు.