వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: కామినేని

అమరావతి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తు ఉండటం వల్లే పోటీ చేశానని చెప్పుకొచ్చారు. నాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని కైకలూరు స్థానాన్ని బీజేపీకి ఇచ్చారని…అయితే ఒకసారి కామినేనికి అవకాశం ఇవ్వాలని 2014లో టీడీపీ నేతలకు వెంకయ్యనాయుడు చెప్పారని గుర్తు చేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లో ఉంటానని..పోటీ చేయనని కామినేని తేల్చిచెప్పారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. బిజెపిలో కీలకంగా ఉన్నా ఇటీవల ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.