వచ్చే ఎన్నికల్లో సమాజ్వాది పార్టీకి అంత్యక్రియలు:కేంద్రమంత్రి బేనీ ప్రసాద్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి బేని ప్రసాద్ వర్మ మరోసారి తనదైన శైలిలో సమాజ్వాది పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.ఎస్పీ ఆధినేత ములాయంసింగ్ యాదవ్కు తీవ్రవాదులతో సంబందాలు ఉన్నాయని ఇటీవల వివాదాస్పద వాఖ్యలు చేసిన ఆయన ఈసారీ ఆపార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో కేవలం నాలుగు లోక్సభ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పి పార్టీ ఉత్తరప్రదేశ్లో 36 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు.