వరంగల్‌ నిట్‌ లో డ్రగ్స్‌ కలకలం

-ఇద్దరు విద్యార్థుల అరెస్టు

వరంగల్‌,ఆగస్టు30  : వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు విద్యార్థులను కాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నిట్‌ కళాశాలలో బీటెక్‌ ్గ/నైల్‌ ఇయర్‌ చదువుతున్న బిజ్జు , రమేష్‌ అనే విద్యార్థులు కొద్ది రోజులుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఇటీవల డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌లో దొరికిన నిందితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని రిమాండ్‌ కు తరలించారు.