వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500
` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం
` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు
` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇంటితో పాటు రూ. 5 లక్షలు
` ముంపునకు గురైన ప్రతి ఎకరానికి రూ. 10 వేలు
` తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
` చివరి బాధితుని వరకు సహాయం అందిస్తాం
` యుద్ధప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమ్మతులు
` డాక్యుమెంట్స్‌ కొట్టుకుపోయాయని ఆందోళన చెందొద్దు
` ప్రతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్‌
` భారీ వర్షాలు, వరదలపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):వరద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయం అందించాలని మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని 33 జిల్లాలను వర్షాప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు.తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచన మేరకు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సవిూక్షలో ముఖ్యమంత్రిసలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌, వ్యవసాయ, పంచాయితీరాజ్‌, విద్యుత్‌, విద్య, రోడ్లు, హౌసింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన  అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి ప్రతిపాదించే నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్‌ కూడా పక్కాగా జరగాలని సూచించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.  భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33 మంది మృతి చెందారని ఇందులో ప్రధానంగా ఖమ్మంలో 6 మంది, కొత్తగూడెంలో 5 మంది, ములుగులో 4 మంది, కామారెడ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గురు చనిపోయారని అధికారులు మంత్రికి వివరించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా పాక్షికంగా కూలిపోయాయి. వీటిని వెంటనే గుర్తించి బాధితులకు రూ. 5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహాయం పూర్తిగా ఆª`లనైన్‌ ద్వారానే బాధితుల అక్కౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడిరచారు. వరద సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని  చూసి మానవతా ధృక్పథంతో రూ.16,500 కి పెంచినట్టు వెల్లడిరచారు. ఈ సహాయాన్ని ఈరోజు నుంచే బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షలాది  ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు మంత్రిగారికి తెలిపారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ.పదివేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురి కాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఆర్‌/బి, పంచాయితీరాజ్‌ విభాగాలకు సంబంధించి వేలాది కిలోవిూటర్ల రహదారులు దెబ్బ తిన్నాయని, గ్రావిూణ మారుమూల ప్రాంతాలలో ఇప్పటికే తాత్కాలిక మరమత్తులు చేపట్టి  కొన్ని రోడ్లను పునరుద్ధరించామని శాశ్వత ప్రతిపాదికన మరమత్తులు చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రెండు మూడు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే మేజర్‌, విూడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించిన మరమత్తులను శాశ్వత ప్రతిపాదికన చేపట్టాలని సూచించారు. తాత్కాలిక మరమత్తులతో ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులు, పాటశాలలు, ప్రాథమిక హెల్త్‌ సెంటర్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న వివరాలను 24 గంటల్లో సచివాలయంలోని  ఆయా విభాగాలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.ªూరీ వర్షాలు, వరదలకు చాలా ఇండ్లల్లోకి నీరు చేరి ఇంటి యజమాని భూ పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులతో పాటు విలువైన పత్రాలు తడిచి పోయాయి, కొట్టుకుపోయాయి. ఈ బాధితులందరూ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆ డూప్లికేట్‌ పత్రాలను అందిస్తారని ఈ విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి గింజను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో పోయడం వల్లనే సూర్యపేట, పాలేరుకు భారీగా నష్టం జరిగింది. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీలు లేకుండా పోయింది. జరిగిన నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. రెండు ఏజెన్సీలు 18 లక్షల క్యూబిక్‌ విూటర్ల వ్యర్థాలను పోశారని అధికారులు వివరించారు.