వరద బాధితులను పరామర్శించిన మంత్రి కోట్ల

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఉన్న  500మందికి పైగా ఉత్తరాఖండ్‌ వరద బాధితులను కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పరామర్శించారు. యాత్రీకులను రేపు సాయంత్రం లేదా ఎల్లుండి గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.