వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

c1rcxyz5చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఛైర్మన్ క్లౌస్ స్క్వాబ్ తో భేటీ అయ్యారు. ఆర్థిక వృద్ధిపై పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో అనుసరిస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని స్క్వాబ్ కు వివరించారు. టీఎస్ఐపాస్ ద్వారా మూడు నెలల్లోనే 56 కంపెనీల నుంచి 12 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిపై స్వ్కాబ్ సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ తో సమావేశం ఆనందం కల్గించిందన్నారు.