వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బుద్ధగయ

బుద్ధగయ,(జనంసాక్షి): బీహార్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోది ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు గాయపడ్డారు.. బాంబు పేలుళ్లకు మహాబోధి ఆలయం చెక్కుచెదరలేదు.
ఆలయం వెలుపల పేలకుండా ఉన్న మరో బాంబును భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. సీఆర్‌పీపీఫ్‌, పోలీసులు ఘటనాస్థలిని చేరుకున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.