వాజ్‌పేయికి మెహబూబా ముఫ్తీ ఘననివాళి

శ్రీనగర్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయికి పిడిపి ఘన నివాళి అర్పించింది. ఆయన మృతి తీరని లోటని మాజీ సిఎం మహబూబా ముఫ్తీ అన్నారు. అంత్యక్రియలకు అన్ని పార్టీల శాసనకర్తలు హాజరుకావాలని జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంతి మెహబూబా ముఫ్తీ కోరారు. 30 మంది పిడిపి ప్రతినిథులతో కలిసి ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఆయన మరణం దేశానికి నష్టమే. కానీకాశ్మీర్‌ ప్రజలు అంతకంటే ఎక్కువ నష్టపోయారు. ఆయనకు కాశ్మీర్‌ ప్రజల బాధ తెలుసు, కాశ్మీర్‌ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, నిబద్ధత, నిశ్చయంతో ఉండేవార’ని కొనియాడారు. ఆయన ఎప్పుడు కాశ్మీర్‌ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి ప్రయత్నించేవారని ముఫ్తీ అన్నారు