వికారాబాద్లో గురు వారం జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలి. – వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి.

వికారాబాద్లో గురు వారం జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలి. – వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి.

మర్పల్లి అక్టోబర్ 04 (జనం సాక్షి) జిల్లా కేంద్రం వికారాబాద్ లో గురువారం జరిగే కేటీఆర్ సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలకు మండలం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు, పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణలో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శమవుతున్నాయన్నారు. ప్రజల ఆశీస్సులతో మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన అన్నారు.