విజయడైరీ ఫారంను ప్రారంభించిన జడ్పీటీసీ అనిల్ జాధవ్.
నేరడిగొండ(జనంసాక్షి):
రైతులు డైరీ పారంను విజయవంతంగా వినియోగించుకొని అధిక లాభం పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.శుక్రవారం మండలంలోని ఇస్పూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ ఫారంను జీపీ సర్పంచ్ జాధవ్ రమేష్ ఆధ్వర్యంలోడైరీ పారంను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ చేతుల మీదుగా
మధుశుదన్ రావు తెలంగాణ విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ విజయ డైరీ మేనజర్ దాసురు నాయక్ లు కలిసి విజయ డైరీ పారంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యవసాయ వృత్తి తోపాటు పాల ఉత్పత్తి. చేసి అధిక లాభం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ డైరీ మేనేజర్లు జి సాయి ఇంచార్జి సంతోష్ సూపర్ వైజర్ కాంత రావు టెక్నీషన్ సర్పంచ్ రమేష్ మంగని నాయక్ నానక్ సింగ్ రోహిదాస్ పతి సింగ్ దరం సింగ్ కానిరామ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.