విజయవాడలో ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో శనివారం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి 2625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రమేష్‌కుమార్‌, కల్నల్‌ పీపీ సింగ్‌ ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈనెల 22 వరకు ర్యాలీ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.