విద్యార్థుల ఇక్కట్లు.. తల్లిదండ్రుల ఆగ్రహం..

డోర్నకల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి

తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.అలాగే గిరిజన భవనాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి గిరిజన నాయకులను,ప్రజలను తరలించుటకు భారీగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుంది.ఇందుకు మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సులను సైతం వినియోగిస్తుంది. దీంతో చిలుకోడు ఆదర్శ పాఠశాలలో చదువు అభ్యసించే విద్యార్థులు ఇక్కట్లకు గురయ్యారు.విద్యార్థులను పాఠశాలకు తరలించే ఆర్టీసీ బస్సు రాక కోసం శుక్రవారం విద్యార్థినీ,విద్యార్థులు రోడ్లపై పడిగాపులు కాశారు.విషయం తెలుసుకున్న జనం సాక్షి ప్రతినిధి ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి పై విషయాన్ని విద్యార్థులకు వివరించారు.బస్సు రద్దు చేస్తున్న విషయాన్ని ముందస్తుగా అధికారులు తెలపకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు