విద్యుత్‌ షాక్‌తో నలుగురి మృతి

చెన్నై,(జనంసాక్షి): తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తలి సమీపంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగిలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారు వాహనంలో ప్రయాణిస్తుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను చెన్నై వీరారెడ్డి, అరుణ, ధనుష్‌, దివ్యలుగా గుర్తించారు.