వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం..

` పోటీపడి వీక్షించిన జనం
న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిరది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే చాలా ఏండ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ కనిపించదట.భారత దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. ఇవాళ్టి గ్రహణం భారత్‌లోని జైపూర్‌, నాగ్‌ పూర్‌, ద్వారక, చెన్నై, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లో కనిపించింది. సరిగ్గా ఇవాళ సాయంత్రం 4.29 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. సాయంత్రం 6.26 గంటల వరకు కొనసాగింది.హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఢల్లీిలో సాయంత్రం 4.29 గంటలకు, కోల్‌కతాలో సాయంత్రం 4.52 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, ముంబైలో 4.49 గంటలకు, ద్వారకలో 4.36 గంటలకు, తిరువనంతపురంలో 5.29 గంటలకు, నాగ్‌పూర్‌లో 4.49 గంటలకు గ్రహణం మొదలైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో పలువురు ప్రత్యేక పరికరాల సాయంతో వీక్షించారు.