విశాఖలో కిడ్నాప్‌ కలకలం

విశాఖపట్టణం,నవంబర్‌11(జనంసాక్షి): విశాలో కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీలో రాకేష్‌ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతం గా తీసుకెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా కడియం దగ్గర కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. విశాఖ పోలీసుల కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.