విశాఖలో నిలిచిపోయిన టీచర్స్‌ బదిలీలు

విశాఖపట్నం, జనంసాక్షి: ఎన్‌ఎంసి హైస్కూల్‌లో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. 8ఏళ్ల దాటి జీవీఎంసీలో ఉన్నవారిని విడిచిపెట్టారని గ్రామీణ టీచర్ల ఆందోళనకు దిగారు. బదిలీల్లో మంత్రి గంటా హస్తం  ఉందని వారు ఆరోపించారు. దాంతో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.