విశాఖ గాజువాకలో విషాదం
కల్తీమద్యం తాగి నలుగురు మృతి
విశాఖపట్నం,ఫిబ్రవరి24(జనంసాక్షి): గాజువాక ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ద్రవం తాగి నలుగురు మృతి చెందారు. గాజువాక ఉప్పరకాలనీలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కల్తీ సారా తాగినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మత్తు పదార్ధంగా భావించి సీసాలోని ద్రావణాన్ని కాలనీవాసులు తాగారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ అసనాల రమణమ్మ(70), కొండోడు(65) వాడపల్లి అప్పడు(65), సండ్ర అప్పలమ్మ(60) మృతి చెందారు. బాదితులంతా పందుల పెంపకం వృత్తిదారులుగా గుర్తించారు.