విశాఖ యువకుడి నామినేషన్ ఓకే
వారణాసి,మే4(జనంసాక్షి): ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి జరగనున్న ఎన్నిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఈ స్థానం నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కొందరు రైతులు నామినేషన్ దాఖలు చేయగా.. విశాఖకు చెందిన ఓ యువకుడు కూడా వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ జిల్లా జోడుగులపాలెం గ్రామానికి చెందిన 31 ఏళ్ల మానవ్ వేసిన నామినేషన్ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి అన్ని సరిగ్గానే ఉండడంతో ఆమోదించారు. కుల, మతాల ప్రస్తావన లేకుండా కనీసం ఇంటి పేరు సైతం లేకుండా మానవ్ నామినేషన్ దాఖలు చేయడం విశేషం.