విశాఖ రైల్వే జోన్‌ మోసపూరిత ప్రకటన : రఘువీరారెడ్డి 

రాజమండ్రి,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): విశాఖ రైల్వే జోన్‌ మోసపూరిత ప్రకటన అని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక
¬దాపై కేందప్రభుత్వాన్ని వైసీపీ నిలదీయాలన్నారు. అలాగే రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు. మోదీని విలన్‌గా…రాహుల్‌ను హీరోగా జనం చూస్తున్నారని రఘువీరా అన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేయటం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.