విశాఖ విమానాశ్రయంలో అదనపు సౌకర్యాలు

విశాఖపట్నం,ఫిబ్రవరి7 జ‌నంసాక్షి

విశాఖ విమానాశ్రయంలో అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. ఇటీవల ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ దేశాల ప్రతినధులు రావడం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రయాణికులు, సందర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. దీనికితోడు నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల దృష్ట్యా అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్ల ఆధునికీకరణ, తనిఖీ కేంద్రాల ఏర్పాటు, విదేశీ ప్రయాణికులు సౌకర్యార్థం ఇమిగ్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు కోసం వచ్చే బంధువులకు టెర్మినల్‌ భవనం బయట కుర్చీలను అదనంగా ఏర్పాటు చేశామన్నారు. సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.