వీరప్ప మొయిలీ సంచలన వాఖ్యలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు దిగుమతి లాబీలు తనని బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు తాను లొంగనన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారు బెదిరిస్తున్నారని చెప్పారు. దేశీయంగా చమురు ఉత్పత్తి కాకుండా అడ్డుకున్నాయన్నారు. ఇది మంచిపద్దతి కాదన్నారు. ప్రజల ఆదాయం అంతా చమురు దిగుమతులకే వెళ్లిపోతుందన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు.