వీరభద్రసింగ్‌ను విచారిస్తున్న సీబీఐ

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరభద్ర సింగ్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా నిన్న వీరభద్రసింగ్‌ నుంచి సీబీఐ అధికారులు కీలక సమాచారం రాబట్టలేకపోయారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని సీబీఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు వీరభద్ర సింగ్‌ నుంచి స్పష్టమైన సమాధానం రావటంలేదని తెలుస్తోంది.