వీర జవాన్‌ మరణిస్తే కనీసం సంతాపం కూడా తెలపరా?

టీడీపీ నేత అచ్చెన్నాయుడు

విశాఖపట్టణం,నవంబర్‌11((జనంసాక్షి)): వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన వీరజవాన్‌ బాబురావు కుటుంబానికి.. ముఖ్యమంత్రి జగన్‌ కనీసం ఒక సంతాప సందేశం కూడా పంపలేదని తప్పుబట్టారు. వీరజవాను బొంగు బాబురావు కుటుంబానికి ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. నాడు- నేడు పథకంలో అవినీతిపై ఏసీబీ విచారణ చేపట్టాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. పాత భవనాలకు మరమ్మతులు.. బెంచీలకు రంగులు వేసి కోట్లు కొల్లగొట్టారని, అధికార పార్టీ ఎమ్మెల్యేనే డీఆర్సీ సమావేశంలో చెప్పారని తెలిపారు. నాడు- నేడు పథకానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న.. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అవినీతిపై విచారణ జరపాలని అయ్యన్న డిమాండ్‌ చేశారు. వీఎంఆర్డీఏ పరిధిలో పేదలకు కేటాయించిన స్థలాల చదును పనుల్లో రూ.23 కోట్ల అవినీతి జరిగిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు.