వీర తిలకం దిద్దితే.. యుద్ధాన్ని మధ్యంలో చేతులెత్తేశారు

` దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ వద్ద మోడీ తాకట్టుపెట్టారు
` ప్రధానిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ఆగ్రహం
` పాక్‌తో యుద్ధం అర్ధంతరంగా ఎందుకు ఆపారు?
` అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడికి ఎందుకు తలొగ్గారు?
` కాల్పుల విరమణ గురించి అఖిలపక్షానికి ఎందుకు చెప్పలేదు?
` గుండెధైర్యం ఉన్నవారే యుద్ధాన్ని గెలిపిస్తారు
` ఇందిరాగాంధీ పాక్‌పై అలాగే గెలిచారు
` జైహింద్‌ ర్యాలీలో సీఎం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్‌,మే29(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని చెప్పుకొచ్చారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. యుద్ధం చేయాలను కున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారని తెలిపారు. ఉగ్రవాదులను తుదముట్టించేవరకు సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ నియోజకవర్గంలో గురువారం జై హింద్‌ యాత్ర నిర్వహించారు. బాచుపల్లి వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌ జ్యోతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి జైహింద్‌ యాత్ర కొనసాగింది. జై హింద్‌ యాత్ర అనంతరం నిజాంపేట కొలన్‌ గోపాల్‌రెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు- చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధంతరంగా ఆపేశారా అని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విూడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారని గుర్తుచేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారా అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని మోదీతో తాము చెప్పామని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడిరచామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. భారత్‌ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో యుద్ధం ఆపాలని ఇందిరాగాంధీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారు. ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులకు లొంగలేదు. నాటి ఇందిర యుద్ధతంత్రాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఇందిరాగాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి. 1967 చైనా, 1971లో పాకిస్థాన్‌ని ఓడిరచినందుకా కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలి. ట్రంప్‌ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. విూ సొంత వ్యవహారం కాదు. భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ దగ్గర తాకట్టు- పెడతారా. యుద్ధం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. భారతదేశ భద్రత విషయంలో అందరం ఏకమవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయాలకు అండగా నిలిచామని ఉద్గాటించారు. దేశంపై పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ విూనాక్షి నటరాజన్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర చేసి కొడంగల్‌లో తనను ఓడిస్తే.. 14 రోజుల్లోనే మల్కాజ్‌గిరిలో ఎంపీగా గెలిపించారని ఉద్ఘాటించారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యానని.. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ప్రజల ముందుకువచ్చానని గుర్తుచేసుకున్నారు. మేం నిర్వహించిన ర్యాలీ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు..సైనికుల ఆత్మ స్థయిర్యం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి. కాలం చెల్లిన రూపాయి ప్రధాని మోదీ. దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరం. బలూచిస్థాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయమన్నాం. ఇది చేతకాదు కానీ.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. యుద్ధంలో ఎన్ని రఫెల్‌ విమానాలు నేలకూలాయో లెక్క చెప్పండి. పాక్‌ను ఓడిరచాలంటే ఇందిరాగాంధీ మార్గంలో..నడవాలని ప్రధాని మోదీకి సూచించాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు ఐదు కమిటీలు
` ప్రకటించిన ఏఐసీసీ
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఐదు కమిటీలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏర్పాటు చేసింది. 22మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్‌ కమిటీ, 16మందితో సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీలను నియమిస్తూ గురువారం రాత్రి ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నది వీరే..
రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌ రెడ్డి, జి.రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, డి. శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీ, అజహరుద్దీన్‌, ఆది శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌, బీర్ల ఐలయ్య, పి.సుదర్శన్‌ రెడ్డి, కె.ప్రేమ్‌సాగర్‌ రావు, జెట్టి కుసుమ్‌ కుమార్‌, ఎరవర్తి అనిల్‌ కుమార్‌ ఉన్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, ప్రత్యేక ఆహ్వానితులుగా క్యాబినెట్‌ మంత్రులు ఉంటారు.
అడ్వైజరీ కమిటీ
మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వి.హనుమంతరావు, జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌, జి.చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జయప్రకాశ్‌ రెడ్డి, జాఫర్‌ జావేద్‌, టి. జీవన్‌ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్‌
డీలిమిటేషన్‌ కమిటీ
చల్లా వంశీచంద్‌ రెడ్డి (ఛైర్మన్‌), గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, డా. శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి, పవన్‌ మల్లాది, డి.వెంకటరమణ
సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ
పి. వినయ్‌ కుమార్‌ (ఛైర్మన్‌), అద్దంకి దయాకర్‌, కె.శంకరయ్య, ఎన్‌.బాలు నాయక్‌, ఎ.నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమళ్ల సిద్ధేశ్వర్‌, సంతోష్‌ కొలకొండ, డా.పులి అనిల్‌ కుమార్‌, జూలూరి ధనలక్ష్మి, మజీద్‌ ఖాన్‌, జి.రాములు, అర్జున్‌ రావు, శౌరి, కొల్లం వల్లభ్‌ రెడ్డి, వి.శ్రీకాంత్‌ రెడ్డి
క్రమశిక్షణా చర్యల కమిటీ
మల్లు రవి (ఛైర్మన్‌), ఎ.శ్యామ్‌ మోహన్‌ (వైస్‌ ఛైర్మన్‌), ఎం.నిరంజన్‌ రెడ్డి, బి.కమలాకర్‌రావు, జాఫర్‌ జావేద్‌, డా.జీవీ రామకృష్ణ

తాజావార్తలు