వీసీ శుక్లా పరిస్థితి విషమం
ఢిల్లీ : నిన్న మావోయిస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెస్ నేత విద్యా చరణ్ శుక్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 84 ఏళ్ల శుక్లాను గుర్గావ్లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన వూపిరితిత్తులు, కాలేయం, పొత్తికడుపుల్లో బుల్లెట్ గాయాలయ్యాయని, అవసరమైన శస్త్రచికిత్సలు చేపడుతున్నామని వైద్యులు ప్రకటించారు. గాయపడినవెంటనే తీవ్రంగా రక్తం పోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారినట్లు వైద్యులు పేర్కొన్నారు.