వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి,మే24(జ‌నం సాక్షి):  వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ప్రమాదాల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురంలో షెడ్డు నిర్మాణ పనుల్లో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో విష్ణుమూర్తి(64), పృధ్వీ(15) అనే ఇద్దరు మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లా మల్యాలలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతిచెందారు. వ్యవసాయం బావిలో ఈతకు వెళ్లిన చందు(10), రియాన్‌(10) అనే ఇద్దరు బాలురు నీటమునిగి చనిపోయారు.