వేసవి విడిది నుంచి బయలుదేరిన గురునాథ్‌

ఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొనవలసిన చెన్నై సూపర్‌ కింగ్‌ సీఈవో గురునాథ్‌ ఇప్పటివరకు మామ శ్రీనివాస్‌తో కలిసి కొడైకెనాల్‌ వేసవి విడిదిలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ముంబయి బయల్దేరినట్లు సమాచారం. శ్రీనివాసస్‌ కొడైకెనాల్‌లోనే ఉండిపోయారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు విచారణకు హాజరు కావలసిందిగా ముంబయి పోలీసులు గురునాథ్‌కు సూచించారు. న్యాయవాదులతో సంప్రదించిన అనంతరం ఆయన విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరినట్లు సమాచారం.