వైభవంగా విగ్నేషుడి శోభాయాత్ర
శివాజి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనం
పాల్గొన్న మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు
మేడిపల్లి – జనంసాక్షి
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ బుద్ధనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి నిమర్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పదేళ్ల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతి యువకులకు ఆటలు పోటీలు, కోలాటాలు, కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 75 మందితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూణే బ్యాండ్ అనంతరం శివాజీ యూత్ కమిటీ సభ్యులు సింగిరెడ్డి నిఖిల్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, మణిదీప్ పటేల్, విష్ణు, వినయ్ రెడ్డి, వినయ్ గౌడ్, సాయి కిరణ్ రెడ్డి, వినయ్, మానస్, ప్రణవ్, గౌతం, విద్యున్, ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరు కేజీల లడ్డు వేలంపాట నిర్వహించారు. వి యాక్సిస్ గ్లోబల్ ఏజెన్సీ (ప్రతిష్ట ఇన్ఫ్రా డెవలపర్స్) సంస్థ వారు లక్ష రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్నారు. నాలుగు కేజీల లడ్డు లక్కం అక్షయ్ కుమార్ రెడ్డి 70,116 రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్నారు. శాలువా పంచ 5000 రూపాయలకు మణిదీప్ పటేల్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అనంతరం మహిళలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు అంతా కలిసి ప్రత్యేక డ్రెస్ కోడ్ ధరించి ఆటపాటలతో అలరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, అమర్ సింగ్, పిట్టల మల్లేష్, నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రఘువరన్ రెడ్డి, యూత్ నాయకులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, ఆపిల్ రాజశేఖర్ రెడ్డి, రాజా, మళ్లీ యాదవ్, చంటి, బబ్బి, స్థానిక కాలనీవాసులు పాశం నర్సిరెడ్డి, సోమిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ.. నవరాత్రుల సందర్భంగా సహకరించిన దాతలకు, శోభాయాత్ర విజయవంతం చేసిన కాలనీవాసులకు యువతీ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.