వైభవంగా శ్రీపద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన అమ్మవారు

తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): తిరుచానూరు శ్రీ పద్మవాతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాలు అంగరగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ శ్రీనివాసమూర్తి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు.లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంత ర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది. సోమవారం రాత్రి

విశేషమైన గరుడ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.

గరుత్మంతుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా సంప్రదాయజ్ఞులు సన్నుతిస్తున్నారు. శ్రీవారినీ, అమ్మవారినీ నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షఃస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజసుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుంది. వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, జెఈవో పి.బపంత్‌కుమార్‌ దంపతులు, సిఇ రమేష్‌రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ కుమార్‌, ఏవిఎస్వో చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.