వోల్వో బస్సు బోల్తా: 35మందికి గాయాలు

వనపర్తి,జూన్‌2(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమందడి మండలం వెల్లటూరు సవిూపంలో హైవే 44పై వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 10 మందిని వనపర్తి, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆసుపత్రులకు తరలించారు.వోల్వో బస్సు హైదరాబాద్‌ నుండి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.