శాంతిఖని గనిలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 17, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో టీబీజికేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకులు వెంకటరమణ, రాజనాల రమేష్, కమిటీ సభ్యులు సూరం మల్లేష్, ప్రేమ్ కుమార్, దాడి రమేష్, కొట్టె రమేష్, మీస అంజయ్య, గని కార్మికులు పాల్గొన్నారు.