శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ పట్టణ శివాలయంలో  జరుగుతున్నటువంటి శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఈ సందర్భంగా శివ స్వాములు  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని శాలువాతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, 2 వ వార్డు కౌన్సిలర్ జక్కుల శంభయ్య, మేరీగ గురవయ్య, శివ స్వాముల బృందము పాల్గొన్నారు.