శ్రీనివాసన్‌ రాజీనామాకు ఎన్సీపీ డిమాండ్‌

ఢిల్లీ, జనంసాక్షి: ఏ మాత్రం నిజాయతీ ఉన్నా బీసీసీఐ అధ్యక్షులు శ్రీనివాస్‌ రాజీనామా చేయాలని శరద్‌ పవార్‌కు చెందిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మీడియా క్రికెటర్లను హీరోలుగా చిత్రిస్తుంది. టీమ్‌ ఇండియా అంటూ ఆకాశానికెత్తుతుంది. అంతటి గౌరవం అందుకునే క్రికెటర్లు అవినీతికి పాల్పడ్డప్పుడు వారికి కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించాలి… అని ఆ పార్టీ ప్రతినిధి త్రిపాఠీ అన్నారు.